టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ

Published: Thursday June 03, 2021
మధిర, జూన్ 02, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతేరాజు అని దేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో తీసుకువచ్చారని తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని వారు తెలిపారుకార్యక్రమంలో మాజీ ఎం.పి.టి.సి పరిటాల పూర్ణచంద్రరావు, మాజీ సర్పంచ్ మందలపు మోహన్ రావు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పాలేటి శ్రీనివాస రావు, రంగిశెట్టి వెంకటేశ్వరరావు మరియు టి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.