గ్రామంలో ప్రతి ఇంటికి మాస్కులు అందజేత

Published: Wednesday May 26, 2021
మధిర, ప్రజాపాలన ప్రతినిధి : 25వ తేదీ మధిర మండలం దెందుకూరు గ్రామంలో అయితం సత్యనారాయణ జ్ఞాపకార్ధం రూ. 2 లక్షల రూపాయల విలువైన 4000 వేల మాస్కులు అందించిన కుమారులుఅయితం. వెంకటేశ్వరరావు, అయితం కృష్ణారావు గార్లు మధిర సిఐ మురళి గారి చేతుల మీదుగా పంపిణీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మధిర మండలం, దెందుకూరు గ్రామంలో శ్రీ బాలగణేష్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అవసరమైన మాస్కులు ఇటీవల మరణించిన అయితం సత్యనారాయణ గారి జ్ఞాపకార్ధం వారి కుమారులు అయితం వెంకటేశ్వరరావు గారు మరియు అయితం కృష్ణారావు గార్లు హైదరాబాద్ లో ప్రత్యేకంగా తయారు చేయించిన రూ. 2 లక్షల రూపాయల విలువైన 4000 వేల మాస్కులను గ్రామంలోని ప్రతి ఇంటికి అందించారు. ముందుగా సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మధిర సిఐ మురళి గారి చేతుల మీదుగా పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోటా. విజయశాంతి గారు, సొసైటీ చైర్మన్ కోటా వెంకటకృష్ణ గారు, షైక్.గాలిబ్ గారు, అల్లు అంకబాబు గారు, అయితం సుబ్బారావు గారు, రామారావు గారు, రామయ్య గారు, బంకా నాగేశ్వరరావు గారు, కుంచెం సతీష్