ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందించిన ఎమ్మెల్యే

Published: Tuesday June 22, 2021

బెల్లంపల్లి, జూన్ 21, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల గ్రామానికి చెందిన రమాదేవికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 60 వేల రూపాయల చెక్కును సోమవారం నాడు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించేందుకు అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేందుకు సీఎం సహాయనిధి నుండి నిధులను అందించడం జరుగుతుందని వాటిని ఆరోగ్య అవసరాల కోసం వాడుకొని ఆరోగ్యంగా జీవించాలని కోరాడు, ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు తోంగల సత్యనారాయణ, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గోమాస శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రజిత వెంకటేష్ గౌడ్, తెరాస నాయకులు తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.