నుకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనికి అభివృద్ధి కి నిధుల మంజూరు --ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Tuesday December 13, 2022

జగిత్యాల, డిసెంబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణానికి చెందిన నుకపల్లి అర్బన్ హౌసింగ్ కాలని కెసిఆర్ కాలనికి డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంక్ లు, కరెంట్, నీటి సదుపాయాల నిమిత్తం ముఖ్యమంత్రి కేసిఆర్ నీ, మంత్రి ప్రశాంత్ రెడ్డి ని 25 కోట్లు నిధులు మంజూరు చేయాలని  కోరగా వారు గృహ నిర్మాణ శాఖ ఎండి సునీల్ శర్మ కి నిధుల మంజూరుకు ఆదేశించగా సోమవారం సునీల్ శర్మ ని నిధుల కేటాయింపు పై వారి కార్యాలయంలో కలవడం జరిగిందని అన్నారు. మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు సీసీ రోడ్ల నిర్మాణం నిమిత్తం 10 కోట్లు మంజూరు చేయగా ముఖ్యమంత్రి కేసిఆర్ కి, మంత్రి ప్రశాంత్ రెడ్డి, దయాకర్ రావు కి  జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపినారు.