తెలంగాణ విజయ గర్జన సభను జయప్రదం చేయండి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Thursday October 28, 2021
బెల్లంపల్లి అక్టోబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి : నవంబర్ నెల 15వ తేదీన వరంగల్లో జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం స్థానిక పద్మశాలి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గం స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో మంచిర్యాల శాసన సభ్యులు నడిపెళ్ళి దివాకర్ రావు తో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్లు లో జరుప తలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను జయప్రదం చేయాలని ప్రతి గ్రామం నుండి, ప్రతి మున్సిపల్ వార్డు నుండి, 50 మంది చొప్పున కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, బయలుదేరి రావాలని ఆయన అన్నారు. వరంగల్లు విజయ గర్జన సభను జయప్రదం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ తెరాస పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డుసభ్యులు, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, టిఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ, గ్రామాల అధ్యక్షులు, సభ్యులు, అనుబంధ కమిటీల అధ్యక్షులు, సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.