"ఈనెల 17న అఖిల భారత పెన్షన్స్ డే"** జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్ల, ప్రజాప్రతినిధులకు ఆహ్వానం **

Published: Wednesday December 14, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 13 (ప్రజాపాలన,ప్రతినిధి): ఈనెల 17న అఖిలభారత పెన్షన్స్ డే ను జిల్లా కేంద్రంలోని పుట్టపర్తి సత్యసాయి భవనంలో జరుపుకొనుటకు నిర్ణయించినట్లు విశ్రాంత ఉద్యోగుల సంగం జిల్లా అధ్యక్షుడు గరిపెల్లి కర్ణ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, అతనపు కలెక్టర్లు, ఏటిఓ లు, ప్రజా ప్రతినిధులు  ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు,జెడ్పి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, జడ్పిటిసి,ఎంపీపీ, సింగిల్విండో చైర్మన్, తదితరులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ పెన్షనర్లకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ నర్సింగ్ రావు, జిల్లా కార్యదర్శి సదానందం, రమేష్, శివ ప్రసాద్, పూర్ణచంద్రరావు, మధుసూదన్ గౌడ్, సింగాడే అశోక్ (సిహెచ్ఓ) డి రామారావు, తదితరులు ఉన్నారు.