అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్, ఏబీవీపీ. నిరుద్యోగ నిరసన దీక్ష
Published: Wednesday December 08, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 7 ప్రజాపాలన ప్రతినిధి : ఏబీవీపీ వీరపట్నం విభాగ్, కందుకూరు నగర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,91,126 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్షతో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంగ.సంజీవ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఖాళీగా ఉన్నా 1,91,126 ఉద్యోగాలను భర్తీ చేయాలని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగాల ఊసేలేదు నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం చేసి విద్యార్థుల ఆత్మబలిదానాలు చేశారని, రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం టెండర్లపైన ఉన్న శ్రద్ద ఉద్యోగ నోటిఫికేషన్ల పైన లేదని నిరుద్యోగుల చావులకు కారణమైన రాష్ట్ర ప్రభుత్వంపైనా హైకోర్టు సుమెటివ్ గా కేసు నమోదు చేయాలని, తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని లేని యేడల రానున్న రోజుల్లో అనేక రకాల ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నగరం నుండి శశిధర్ రెడ్డి, పవన్, సందీప్, సాయి ధనరాజ్, కందుకూరు, మాల్, యాచారం, మహేశ్వరం, కడ్తాల్, అమంగల్, తలకొండపల్లి నగరాల నుండి ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు మరియు మద్దతుగా పూర్వ ఏబీవీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: