కరోనా బాధితులకు పండ్లు, కోడిగుడ్ల పంపిణి

Published: Tuesday May 25, 2021
కోరుట్ల,మే 24 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో అంబేద్కర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా వచ్చిన వారికి పండ్లు,కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ కరోనా వచ్చిన వారు ఎవరు భయపడకండి, సరైన సమయంలో మందులు తీసుకుంటూ సరైన పోషకాలున్న ఆహారం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఆర్గనైజర్ కుంటాల వికాస్, లింగంపల్లి నవీన్, మారంపల్లి నితీష్, మారంపల్లి భార్గవ్, మారంపల్లి అశోక్, కుంటాల శ్రీ రాములు, మారంపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.