హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో బియ్యం వితరణ..

Published: Tuesday April 12, 2022
తల్లాడ, ఏప్రిల్ 11 (ప్రజాపాలన న్యూస్): తల్లాడకు చెందిన తుపాకులు రాఘవ (లారీడ్రైవర్) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మదర్ తెరిస్సా హెల్పింగ్ హాండ్స్ సంస్థ నిర్వాహకులు ఆ కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యాన్ని అందించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బండారు బ్రహ్మం, వెచ్చా నరసింహారావు, షేక్ నజీర్, షేక్ షఫీ, ఎస్ కే జానీ, కొత్తూరు ఫణి తదితరులు ఉన్నారు.