హుజురాబాద్ పట్టణ 1వ వార్డులో మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ.శ్రావణి ప్రచారం

Published: Wednesday October 27, 2021

జగిత్యాల, అక్టోబర్, 26 (ప్రజాపాలన ప్రతినిధి) : హుజురాబాద్ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు మద్దతుగా పట్టణ 1వ వార్డులో, గెల్లు శ్రీనివాస్ కలిసి పట్టణ సూపర్ బజార్ ఏరియా లో జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ.శ్రావణి ప్రవీణ్ ప్రచారం నిర్వహించినారు. అనంతరం రాష్ట్ర మంత్రి టి.హరీష్ రావు, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కలిసి ప్రచారం గురించి చర్చించినారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వనిత కుమార్ యాదవ్, కరీంనగర్ జెడ్పిటిసి రవీందర్, వార్డు అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, వార్డు ఇంచార్జి ఎల్లం యాదవ్, బండారి నర్సయ్య, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.