పుస్తకాల ఆవిష్కరణ బి ఎస్ రాములు
Published: Tuesday August 23, 2022
బి ఎస్ రాములు గారి సాహిత్య సమాలోచన పుస్తకావిష్కరణ:
------------
కరీంనగర్లో బిఎస్ రాములు సాహిత్య సమాలోచన అనే సెమినార్ పుస్తకం ను శతాధిక గ్రంథకర్త డాక్టర్ మలయశ్రీ ఆవిష్కరించారు. ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సురేందర్ రెడ్డి
జిల్లా నాయకులు జోజి రెడ్డి, కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, జర్నలిస్టు సంఘం అధ్యక్షులు , వేదిక నలంకరించారు.
సాహిత్య అభిమానులు మలయశ్రీ గారి సహచరి 65 ఏళ్ల అనుబంధం గురించి విషాద గీతం అందరినీ కదిలించింది. భారతీ దేవి గారికి జోహార్లు అంటూ సభికులంతా నివాళి అర్పించారు.
ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీ నుండి నిదానం కవి నీరజ అసిస్టెంట్ ప్రొఫెసర్ గారి అధ్వర్యంలో జరిగివ జాతీయ సెమినార్ లో ప్రముఖులు బి ఎస్ రాములు కథలను, నవలలను సాహిత్య వ్యాసాలను పరిశోధన పత్రాలు చక్కగా వివరించాయని వక్తలు పేర్కొన్నారు.
నేటి రాజకీయ పరిస్థితులపై సూచనలు చేయాలని కోరడంతో బి ఎస్ రాములు తాను రాసిన బీసీ నోట్ బుక్ గురించి వివరించి చదవాలని కోరడంతో పాటు
సిద్దాంత అవగాహన కోసం " బౌద్ధం సోషలిజం మార్క్సిజం అంబేద్కరిజం" పుస్తకాన్ని మలయశ్రీ చేత ఆవిష్కరించి వేదిక పై ఉన్నవారికి బహూకరించారు.
"బి ఎస్ రాములు సాహిత్య సమాలోచన " గ్రంథాన్ని సభికులందరికి బహూకరించిన ఈ సభను జోజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ా
--
Share this on your social network: