మధిర మున్సిపాలిటీ 7వ వార్డులో దోమల మందు పిచికారీ

Published: Wednesday September 08, 2021

మధిర, సెప్టెంబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, మున్సిపల్ శాఖా మాత్యులు కేటీర్ పిలుపు మేరకు సీజనల్ వ్యాధులు,డెంగ్యూ చికెన్ గున్యా లాంటి జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సూచనల మేరకు మధిర మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్-పర్సన్ మొండితోక లత జయాకర్, మున్సిపల్ కమీషనర్ రమాదేవి నేత్రత్వంలో మడుపల్లి 7వ వార్డు వార్డులో కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి కిరణ్ ఆధ్వర్యంలో దోమల మందు పిచికారీ చేయించడం జరిగింది. ఈ సందర్బంగా ఇంటి పరిసరాలలో, పాత తొట్ల లో నీరు నిల్వ ఉండకుండా, జాగ్రత్తగా ఉండాలి, అలాగే సీజనల్ వ్యాధులు పట్ల అవగాహన కల్గి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మేడికొండ కిరణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.