కిలార్ తిరుపయ్య సంస్మరణ సభకు తమ్మినేని రాక

Published: Saturday July 16, 2022
బోనకల్, జులై 16 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికీ చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ,మాజీ ఎంపీటీసీ కిలారు తిరుపతయ్య సంస్మరణ సభ శనివారం ఉదయం 11 గంటలకు లక్ష్మీపురం గ్రామంలో జరగనున్నది. ఈ సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొననున్నట్లు సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరావు తెలిపారు.కావున సభకు సిపిఎం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు, సిపిఎం పార్టీ సానుభూతిపరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.