పౌర హక్కులను సద్వినియోగం చేసుకోవాలి.. తల్లాడ ఎంపీడీవో రవీంద్రారెడ్డి..

Published: Tuesday January 31, 2023
తల్లాడ, జనవరి 30 (ప్రజా పాలన న్యూస్):
 పౌర హక్కులను దళితులు, గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని తల్లాడ మండల పరిషత్ అభివృద్ధి అధికారి భీమిరెడ్డి రవీంద్రారెడ్డి సూచించారు. సోమవారం  మండలంలోని నూతనకల్లు గ్రామంలో గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను దళితులు, గిరిజనులు ఎలా పొందాలనే దానిపై వారికి క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. మహిళల హక్కులు వాటి విధి, విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు, వార్డెన్,  ఆర్ఐ శ్రీనువాస్, హెచ్ఎం వెంకటేశ్వరరావు, సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.