తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య

Published: Wednesday September 08, 2021

హైదరాబాద్, సెప్టెంబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య. సోమవారం నాడు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును కార్యాలయంలో మాల మహానాడు మరియు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలవడం జరిగింది. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పంజాగుట్ట కూడలిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పునః ప్రతిష్టించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్, టి. ఎంఆర్.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ, ఇటుక గోపి, రాజేశ్వరరావు, పంజాగుట్ట విగ్రహ కమిటీ అధ్యక్షుడు భాను ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.