నెర్రెపల్లి దుర్గామాత పూజలో పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి

Published: Friday October 08, 2021

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం నేరపల్లి గ్రామంలో డ్రీం బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో గురువారం ప్రతిష్టించిన దుర్గామాత పూజలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రులను అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలని ఆయన అన్నారు. అమ్మవారి దయ వల్ల ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసాయి. పాడిపంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. అనంతరం డ్రీమ్ బాయ్స్ ఆధ్వర్యంలో మర్రి నిరంజన్ రెడ్డి కి శాలువాలతో సన్మానించి, జ్ఞాపికను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం ఎం ఏం ఆర్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ రవీందర్, రాజ శేఖర్ రెడ్డి, బాల కృష్ణ, వేణు, జగదీష్, నాగ రాజు గౌడ్, శ్రీకాంత్, కర్ణకర్, సాయి కిరణ్, ఎంఎన్ ఆర్ టీం సభ్యులు  తదితరులు పాల్గొన్నారు