*అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ సాధ్యం* *టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన

Published: Friday June 03, 2022

ఆసిఫాబాద్ : అమరవీరుల త్యాగాల తోనే తెలంగాణ స్వరాష్ట్రం సాధ్యమైందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే - ఐజేయు) జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద జర్నలిస్టులతో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నో ఆశయాలతో తెలంగాణ స్వరాష్ట్రం కోసం అనేక మంది యువకులు త్యాగాలు చేశారు కానీ నేటి తెలంగాణలో అమరవీరుల ఆశయాలు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల త్యాగాలు వృధా కాకుండా సామాజిక తెలంగాణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు సురేష్ చారి, జాడి రాందాస్ తదితరులు పాల్గొన్నారు.