ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మెల్యే. డా.సంజయ్

Published: Monday November 01, 2021

జగిత్యాల, అక్టోబర్ 31 (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణ పావని కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 17 మంది నిరుపేదలకు ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ చేసినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా నిరుపేదలకు అత్యాధునిక ఉచిత నేత్ర చికిత్సలు చేస్తున్నామని, అందరికి చూపు వచ్చిందని, కాపాడుకోవాల్సిన భాద్యత పేషేంట్ వారి బందువులపై ఆధారపడి ఉందని, ఉచితంగా మందులు, కళ్ళ అద్దాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సారంగాపుర్ వైస్ ఎంపీపీ సురేందర్, నాయకులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.