పౌష్టికాహారం ఆవశ్యకత ను ప్రతీ ఒక్కరూ . తెలుసుకోవాలి..
Published: Thursday September 08, 2022
పాలేరు సెప్టెంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
పౌష్టికాహారం ఆవశ్యక్యత ను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని నేలకొండపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్. ఆలేటి పరంజ్యోతి సూచించారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జూవాలజీ, బోటనీ విభాగాల ఆధ్వర్యంలో జాతీయ పౌష్టికాహారం వారోత్సవాలు ఘనంగా
నిర్వహించారు. బుధవారం ముగింపు సందర్భంగా కాలేజీలో పౌష్టికాహార పదార్థాల ప్రదర్శన ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె
మాట్లాడుతూ...ప్రతీ రోజు మనం తీసుకునే ఆహరం లో ఆవశ్యక పదార్థాల ప్రాముఖ్యత వివరించారు. ఆరోగ్యం విషయంలో, తీసుకునే ఆహరంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ప్రతీ ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎన్.మాధవరావు, ఆధ్యాపకులు కవిత. సి.హెచ్. శ్రీనివాస్, మాధవి.
కోటమ్మ, అనిత, శ్రీనివాస్, రఫీ, రాజన్, జానకిరామారావు. ఆధ్యాపకేతర
సిబ్బంది. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: