కాంగ్రెస్ పార్టీ నుండి టీ.ఆర్.ఎస్ పార్టీలో చేరిన మర్రి సంపతీశ్వర్ రెడ్డి

Published: Monday June 20, 2022
ఇబ్రహీంపట్నం జూన్ తేది 19 ప్రజాపాలన ప్రతినిధి.
 
టీ.ఆర్.ఎస్ లో భారీ చేరికలుఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని బ్రాహ్మణపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి సంపతీశ్వర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, టీ.ఆర్.ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  సమక్షంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర సమితి( టిఆర్ఎస్ ) పార్టీలో చేరారు.
మాజీ ఉప సర్పంచ్ లింగాల రవీందర్ గౌడ్, మాజీ వార్డు మెంబర్లు మర్రి రంగారెడ్డి, జల్ల రాములు, కర్ని అశోక్, కర్ని జంగయ్య, సంగి రమేష్, సీనియర్ నాయకులు పాండు చారి, కామటి ప్రభాకర్, ఎడ్ల కొండల్ రెడ్డి, చిప్పలపల్లి జంగారెడ్డి, సంరెడ్డి నారాయణ రెడ్డి, ఎడ్ల మహేందర్ రెడ్డి, ఎడ్ల రాంరెడ్డి, ఏనుగు శ్రీధర్ రెడ్డి, కృషా చారి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువజన నాయకులు తదితరులు భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరారు.