మడుపల్లి గ్రామంలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన జగ్గయ్యపేట టిడిపి మాజీ ఎమ

Published: Thursday January 20, 2022
మధిర జనవరి 19 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలోమడుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆంద్రప్రదేశ్ మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన జగ్గయ్యపేట మాజీ టిడిపి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్యఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారకరామారావు కు భారత రత్న అవార్డు ఇవ్వాలని ఆంధ్రా, తెలంగాణ రాష్టాలలో మంత్రులు కూడా కోరుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.రామనాధం ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు, మధిర అర్బన్ టీడీపీ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు మడుపల్లి గ్రామ శాఖ టిడిపి అధ్యక్షులు దౌపాటి అనిల్ కుమార్, ఖమ్మం జిల్లా తెలుగు యువత కార్యదర్శి వూట్ల నవీన్, మడుపల్లి గ్రామ టిడిపి నాయకులు, కార్యకర్తలు సూదిగుంట రామారావు, గడిపుడి వీరభద్రరావు, తోటకూర చంద్రయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.