మౌన పోరాటం చేస్తున్న ఐశ్వర్యకు మద్దతు తెలిపిన వేమనపల్లి జెడ్ పి టి సి, స్వర్ణలత సంతోష్ కుమార

Published: Wednesday May 11, 2022
బెల్లంపల్లి మే 10 ప్రజాపాలన ప్రతినిధి: గత రెండు రోజులుగా ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం చేస్తున్న ఐశ్వర్య కు ముల్కలపెట్ కు వెళ్లి మద్దతు తెలిపిన,  వేమనపల్లి జెడ్ పి టి సి ఆర్, స్వర్ణలత సంతోష్ కుమార్, నీల్వాయి ఎంపీటీసీ ఆర్, సంతోష్ కుమార్ లు, బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండలంలోని ముల్కలపెట్ గ్రామానికి చెందిన ఎల్కరి ఐశ్వర్య, అదే గ్రామానికి చెందిన పబ్బా చెందు (ప్రవీణ్) గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు, గత వారం రోజుల క్రితం పబ్బా చెందు (ప్రవీణ్) కు కోటపల్లి మండలం సూపాక గ్రామానికి చెందిన వేరొక అమ్మాయి తో నిశ్చితార్టం జరగగా, విషయం  తెలుసుకున్న ఐశ్వర్య ప్రియుడు చెందును పెళ్లి చేసుకోవాలని నిలదీయగా, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని, నేను నీతో పెళ్లి చేసుకొనని అనడంతో, తను ప్రియుడి చేతిలో మోసపోయానని గ్రహించిన అమ్మాయి ఐశ్వర్య, ప్రియుడు ఇంటి ముందు మంగళవారం నుండి న్యాయం జరిగే వరకు మౌన పోరాటం చేస్తానని నిర్ణయించుకొని ప్రియుడు ఇంటి ముందు పోరాటo చేస్తుంది. విషయం తెలుసుకున్న జెడ్ పి టి సి స్వర్ణలత, ఐశ్వర్య వద్దకు వెళ్లి మద్దతుగా బుధవారం దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ, అమ్మాయి కి న్యాయం జరిగే వరకు అండగ ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీల్వాయి ఎంపీటీసీ ఆర్, సంతోష్ కుమార్, నీల్వాయి సర్పంచ్ గాలి మధు, మైనార్టీ నాయకులు సయ్యద్ సాబీర్ అలీ, కేతనపల్లి సర్పంచ్ అవులమారి దుర్గక్క, మాజీ సర్పంచ్ ఇగురం జగన్, మాజీ ఉప సర్పంచ్ మధుసూదన్ తదితరులు, పాల్గొన్నారు.