బ్రహీంపట్నం నవంబర్ తేదీ 20ప్రజాపాలన ప్రతినిధి *నూతన జాతీయ విద్యా విధానాన్ని* *ఉపసంహరించుకోవా

Published: Monday November 21, 2022

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ  ఇబ్రహీంపట్నం మండల్ కమిటీ ఆధ్వర్యంలో  ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా నూతన జాతీయ విద్యా విధానం (nep) పైన  ఎస్సీ ఎస్టీ హాస్టల్లో లో సెమినార్ నిర్వహించడం జరిగింది.
ఈ సెమినార్ కు ముఖ్య అతిథులు రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజ గారు గారు హాజరై  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం విద్యారంగానికి అసమానతలు పెంచుతుందని అన్నారు. ఈ విద్యా విధానం అమలయితే పేద మధ్యతరగతి విద్యార్థులకు  దూరం చేయడంలో ఒక భాగమే అని మండిపడ్డారు. విద్య వ్యవస్థని పూర్తిగా  కార్పొరేటులకు కట్టబెట్టే పేదవారికి విద్య అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు. ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసహరించుకోవాలని కోరారు.*ఎస్ఎఫ్ఐ  ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు ఏర్పుల తరంగ్*
ఎస్ఎఫ్ఐ 17వ ఆల్ ఇండియా మహాసభలు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో 13 నుంచి 16 వరకు జరుగుతున్నాయని అన్నారు.ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి ప్రతినిధులు, మేధావులు హాజరవుతున్నారని కోరారు. ఈ మహాసభలలో దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమ నిర్మాణం కోసం కార్యచరణ రూపొందిస్తారని అన్నారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ   జిల్లా కార్యదర్శి బి శంకర్, గర్ల్స్ కో కన్వీనర్ మమత, జిల్లా నాయకులు జంగయ్య వంశీ వినోద్ విద్యార్థులు పాల్గొన్నారు,