సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Published: Monday July 19, 2021
కోరుట్ల, జూలై 18 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. తదినంతరం టి.టి.డి కల్యాణ మండపం ప్రహరీ గోడకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోటి నారాయణ, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య రాజేష్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చీటి వెంకట్రావు, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, పి.ఎ.సి.ఎస్ చైర్మన్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.