రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేసిన కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి
Published: Wednesday November 02, 2022
మేడిపల్లి, నవంబర్ 1 (ప్రజాపాలన ప్రతినిధి)
భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ మరియు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి పాదయాత్ర చేసిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి.
ఈ పాదయాత్రలో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ నాయకుడు చేయనటువంటి సాహసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు, 150 రోజుల పాదయాత్రగా చేసి దేశ ఐక్యతను చాటి కుల,మత బేధాలు లేకుండా అందరం కలిసి మెలసి ఉండాలనే సంకల్పలతో చేస్తున్న ఈ మహా పాదయాత్రకు ప్రజలందరూ బ్రహ్మరథం పడుతు, భావి ప్రధాని యువ కిరణం రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఈ యాత్ర ద్వారా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాగిడి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Share this on your social network: