నేడే పెన్షన్ దారులకు గుర్తింపు కార్డుల పంపిణీ ముఖ్య అతిథులుగా సీఎల్పీ నేత, జిల్లా పరిషత్ చై

Published: Thursday September 01, 2022

బోనకల్, ఆగస్టు 301 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని రైతు వేదిక నందు గురువారం అనగా ది.01.09.2022 న సాయంత్రం 4.00 గంటలకు బోనకల్ మండలమునకు కొత్తగా మంజూరీ అయిన 1750 పెన్షన్లు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమము సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమాల్ రాజు, మండల ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, జడ్.పి.టి.సి మోదుగు సుధీర్ బాబు, మండలంలోని సర్పంచులు, ఎం.పి.టి.సి సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు , ఇతర ప్రజా ప్రతినిధుల సమక్షములో బోనకల్ రైతు వేదిక నందు లబ్ధిదారులకు మంజూరీ అయిన పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ చేయబడును. కావున ఇట్టి కార్యక్రమ మునకు నూతన పెన్షన్ దారులు, తప్పక హాజరు కావాల్సిందిగా కోరుచున్నాను.