నూతన శివాలయమునకు లక్ష రూపాయల విరాళం

Published: Tuesday March 15, 2022

కొడిమ్యాల, మార్చి 14 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయపేట గ్రామంలోని అటవీ ప్రాంతంలో మనువోతుల బోడ సమీపాన నూతనంగా స్వయంబుగా వెలసిన శివలింగం స్థలంలో ఆలయ నిర్మాణం కొరకు సన్నాహాలు చేస్తున్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన పోగుల నర్సయ్య కుమారుడు ధర్మపురి, ధర్మపత్ని దేవవ్వ దంపతులు (100116) ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఆలయ నిర్వాహకులైన గ్రామస్తులకు విరాళంగా అందజేశారు, ఈ సందర్భంగా వారి కుటుంబానికి ఎల్ల వేళలా ఆ భగవంతుని కృప ఉండాలని గ్రామస్తులు కోరారు, ఈ కార్యక్రమంలో కంకణాల సురేష్, దొంతరవెని శంకర్, కొలకాని సాయిబాబా, తునికి శంకర్, గుడిపెళ్ళి బాలరాజు, అమ మల్లయ్య , తుణికి నవీన్, కంకణాల రాయమల్లు, తదితర గ్రామస్తులు పాల్గొన్నారు