శ్రీ మైసమ్మ అమ్మవారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తెరాస నేత బండారి లక్ష్మారెడ్డి
Published: Thursday November 24, 2022
మేడిపల్లి, నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ నియోజకవర్గం మీర్ పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ మైసమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెరాస సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు సాయి జన్ శేఖర్, కటార్ల భాస్కర్ సేవా సమితి సభ్యులు మరియు అంజి, బీరప్ప, వీరేందర్, సాంబశివ భాను, ప్రకాష్, రవి, నభి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: