అభివృద్ధి పనులను పర్యవేక్షించిన - మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు

Published: Tuesday May 31, 2022

రాయికల్, మే 30 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణంలోని పెద్ద చెరువు కట్టను ఒక కోటి 50లక్షలరూపాయలతో నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు పర్యవేక్షించారు. అనంతరం  కాంట్రాక్టర్ తో చరవాణి ద్వారా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ వెంట కౌన్సిలర్లు  తుర్గ శ్రీధర్, మహేష్, టిఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ ఎలిగేటి అనిల్ పాల్గొన్నారు.