హరిశంకర్ గౌడ్ కి భూసేవ మద్దతుగా

Published: Monday February 22, 2021

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పాలన వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మన ముందుకు మన సేవకే సేవకుడిగా వస్తున్నా సుధాగాని ఫౌండేషన్ చైర్మన్ సుధాగాని హరిశంకర్ గౌడ్ భూసేవ స్వచ్చంద సంస్థ పూర్తి మద్దతు తెలుపుతున్నమని, ఆ సంస్థ సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ముద్దుబిడ్డగా సర్దార్ సర్వాయి పాపన్న, కొండా లక్ష్మణ్బాపూజీ, వారసత్వం అంది పుచ్ఛికొని తన ఫౌండేషన్ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్న సుదగోని ఫౌండేషన్ చైర్మన్ అందరి అంచనాలు మించి ఎమ్మెల్సీ పోటీలో ముందు వరుసలో ఉంటాడాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అవుతాడాని ఆశిస్తున్నాము అన్నారు.ఈ కార్యక్రమంలో గణేష్, సురేష్, శ్రీకాంత్, నవీన్, మధు, నరేష్, రవి, శ్రీకాంత్, శ్రీను, విష్ణు తదితరులు పాల్గొన్నారు.