అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ కోరుట్ల డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Published: Monday July 04, 2022

కోరుట్ల, జూలై 03 (ప్రజాపాలన ప్రతినిధి):
అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ అధ్యాక్షులు రాజేష్ ఆదేశాల మేరకు అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్   తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.ఏ ముసవ్విర్ మరియు జగిత్యాల జిల్లా కమిటీ  ఆధ్వర్యంలో కోరుట్ల డివిజన్ లోని సభ్యులు పాల్గొని అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ కోరుట్ల డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ కోరుట్ల డివిజన్ అధ్యక్షునిగా జవ్వాజి గంగాధర్ , ఉపాధ్యాక్షునిగా మద్దనపెల్లి నాగేష్, కార్యదర్శిగా యం.డి అజార్ పాషా, సహాయ కార్యదర్శులుగా వనతడుపుల మహతేజ, కోశాధికారిగా చిలుక నాగ భూషణ్, కార్యనిర్వాహక సభ్యులుగా
మర్రిపెల్లి నవీన్, ఎన్నుకోవడం జరిగిందని అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్  జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఇంద్రాల హరీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికయిన నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ మాపై నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్న జర్నలిస్ట్ లకు ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తామని అన్నారు.