సారపాక లో అభివృద్ధి ధ్యేయంగా బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత బృందం పర్యటన. అడుగడుగు

Published: Saturday November 05, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.)
 
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లో సారపాక లో  9వ రోజు అనునిత్యం ప్రజలకు కొరకు కార్యక్రమంలో సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని  రిక్షా కాలనీ , మేడే కాలినీ,  ఏరియాలలో... బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ,విస్తృతంగా పర్యటించారు ఉదయం 6 గంటల నుంచి కాలనీలలో పర్యటించి సమస్యలను ప్రజల ద్వారా గుర్తించారు త్రాగునీరు డ్రైనేజీ రహదారులు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు ప్రజలు జెడ్పిటిసి  దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యల పరిష్కారం దిశగా సంబంధిత అధికారులతో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడారు సమస్యలను త్వరగారితిన పూర్తి చేయాలని ఆమె కోరారు.
 పినపాక నియోజకవర్గలోని అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు, నియోజవర్గంలో మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను  శ్రీ రేగా కాంతారావు  కృషితో , కోట్లాది రూపాయల నిధులు మంజూరు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారన్నారు, వారి సహకారంతో అనేక గ్రామాలకు సిసి రోడ్లు బీటి రోడ్ల నిర్మాణం, కల్వర్టులు బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, ప్రజల దగ్గరికి వెళ్లి వారితో కాసేపు ముచ్చటించారు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు, గ్రామాలలో ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే  ప్రభుత్వం పని చేస్తుందన్నారు, ప్రజల అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని అన్నారు, గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ప్రభుత్వం అందిస్తుంది అన్నారు రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు, భారతదేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా  అందిస్తున్నారని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్  బిక్కసాని శ్రీనివాసరావు గారు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ ,  బిఆర్ఎస్ర్ సారపాక  టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాసరావు, పినపాక నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణచందర్ , సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ లక్ష్మి చైతన్య రెడ్డి, ఉపాద్యక్షులు ఆంజనేయులు,.   సినియర్ యూనియన్ నాయకులు దారుగా గారు,  బిఆర్ స్ సినియర్ నాయకులు మెహన్ ,  మండల కార్మిక విభాగము,మర్రి సాంబిరెడ్డి, , వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి, ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు, ఉప అధ్యక్షుడు సట్టు అంజనేయులు ,ప్రధాన కార్యదర్శి భూక్య చిరంజీవి,  బిఆర్ స్ పార్టీ నాయకులు బెజ్జంకి కనక చారి , మాజీ ఎంపీటీసీ బిక్షపతి మండల మహిళా అధ్యక్షురాలు లలిత,  నక్క రమాదేవి, చుక్కపల్లి  బాలాజీ,  సారపాక టౌన్ బిసి కార్యదర్శి వల్లెపు బొబ్బిలి , సాయిబాబు, కాకాని రాంబాబు,నాగ, కార్యకర్తల అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.