ఘనంగా సహస్ర జన్మదిన వేడుకలు..* బ్యాగులు పంపిణీచేసిన సర్పంచ్ మారెళ్ళ మమత

Published: Thursday November 10, 2022
తల్లాడ, నవంబర్ 9 (ప్రజాపాలన న్యూస్):
 *టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మారెళ్ళ లక్ష్మణరావు మనమరాలు (దూదిపాళ్ళ లక్ష్మణ్, రాధిక దంపతుల కుమార్తె) సహస్ర జన్మదిన వేడుకలను బుధవారం తల్లాడ మండలంలోని అన్నారుగూడెంలో నిమ్మగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత, మండల విద్యాశాఖ అధికారి దామోదర్ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహస్ర జన్మదిన వేడుకలను పేద విద్యార్థుల మధ్య జరుపుకోవడం అభినందనీయమన్నారు. తొలుత నూతన గదులను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మారెళ్ళ లక్ష్మణరావు, హెచ్ఎంలు వెంకటేశ్వరరావు, సరోజినీ, ఉపాధ్యాయులు మాదినేని నరసింహారావు,  గ్రామ విడిసి చైర్మన్ మారెళ్ళ మల్లికార్జునరావు, మాజీ ఎంపీటీసీ తాళ్ల జోసెఫ్, తెరాస నాయకులు తుమ్మలపల్లి రమేష్, పొన్నం కృష్ణయ్య, గోవిందు శ్రీనివాసరావు(ట్రాక్టర్), యలమంచి వెంకటయ్య, పునాటి సత్యమయ్య, దుగ్గినేని గోపయ్య, మల్లిడి వెంకటేశ్వరరావు, మల్లిడి శేషయ్య, గుమ్మా వలరాజు, ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.*