బొర్రా వెంకటేశ్వర్లు ప్రథమ వర్ధంతికి హాజరైన పొంగులేటి
Published: Tuesday April 26, 2022
వైరా: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఖమ్మంజిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా వైరా మండలంలోని కమ్మవారి కల్యాణ మండపంలో జరిగిన రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్ తండ్రి మాజీ సర్పంచ్ బొర్రా వెంకటేశ్వర్లు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు.
Share this on your social network: