ఘనంగా జాతీయ గిరిజన స్వాతంత్ర సమరయోధులు భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు

Published: Thursday November 18, 2021
బోనకల్, నవంబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి : భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో స్వాతంత్ర సమరయోధులు శ్రీ భగవాన్ బిర్సా ముండా గారికి ప్రత్యేక స్థానం కల్పించి జన్ జాతీయ గౌరవ్ దివస్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక మండల కేంద్రంలో బీజేపీ యువ నాయకులు ఎన్ఆర్ఐ బీపీ నాయక్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీపి నాయక్ మాట్లాడుతూ బిర్సా ముండా పోరాటపటిమను ప్రజలకు వివరించారు. రానున్న కాలంలో జాతీయ గిరిజన గౌరవ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పండుగలా జరపాలని, నవంబర్ 15న సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు గుగులోత్ కిషన్ నాయక్, సేవాలాల్ మహారాజ్ సమితి అధ్యక్షులు భూక్య రమేష్ నాయక్, కోర్ కమిటీ సభ్యులు ఉపేంద్ర, ధనుష్ భూక్యా గోవిందు తదితరులు పాల్గొన్నారు.