విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన సర్పంచ్ సామల హంసమ్మ

Published: Wednesday July 20, 2022
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను మరియు ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి పంపించిన ఇంగ్లీష్ డిక్షనరీలను సర్పంచ్ సామల హంసమ్మ యాదగిరి రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్ రెడ్డి, ఉపసర్పంచ్ ఎండి మునీర్ పంపిణీ చేశారు. అనంతరం మిషన్ భగీరథ నీటిపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మిషన్ భగీరథ వాటర్ యొక్క ప్రాముఖ్యతను ఏఈ ప్రణీత్  పూర్తిగా పిల్లలకు అవగాహన చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ ప్రణీత్, పంచాయతీ కార్యదర్శి విక్రమ్, వార్డు సభ్యులు ఇందిరా, ప్రధానోపాధ్యాయుడు వెంకట్ , ఎస్ఎంసి చైర్మన్  అంజి , నాయకులు సామల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.