ఎఫ్ ఆర్ ఓ శ్రీనివాస రావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన మంత్రులు పువ్వాడ, ఇంద్రకరణ్ రెడ్డ

Published: Thursday November 24, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడులో ఘటనలో మృతి చెందిన శ్రీనివాసరావు మృతదేహాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  ,భద్రాద్రి కొత్తగూడెం బిఆర్ఎస్  పార్టీ జిల్లా అధ్యక్షుడు పినపాక శాసనసభ్యులు   రేగకాంతారావు  సందర్శించి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు. శ్రీనివాస రావు ఆత్మ‌కు శాంతి కలగాలని ఆకాంక్షించారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాసరావు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఅర్ తెలంగాణ ప్రభుత్వం తరుపున రూ.50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించిందన్నారు.
ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. మంత్రుల వెంట రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు రెగా కాంతారావు, రాములు నాయక్, మెచ్చ నాగేశ్వర రావు, ఎమ్మెల్సీ తాత మధు, సీఎమ్ఓ  సెక్రటరీ స్మితా సబర్వాల్, హరితాహరం ఓ ఎస్ డి ప్రియాంక వర్గీస్, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్  దొబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, కలెక్టర్  గౌతమ్, కొత్తగూడెం  ఎస్పి వినీత్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.