*తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని
Published: Wednesday January 25, 2023
కొందుర్గు మండల వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ గారు*
ప్రజాపాలన కొందుర్గ్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చి కంటి పరీక్షలు చేసుకోవాలని వివిధ వార్డులలో ఇంటిటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
కొందుర్గ్ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని 18 సం. నుండి 60 సం వరకు గ్రామస్తులు ఎవరైనా,ఇక్కడ కంటి పరీక్షలు చేయించుకోవవచ్చు. కంటి సమస్యలు ఉన్నవారికి అవసరమైన మందులు గాని,కళ్ళద్దాలు గాని,శస్త్ర చికిత్స ఉచితంగా ప్రభుత్వం చేయిస్తుంది.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేఖ,ఎంపీటీసీ మానయ్య, వార్డు సభ్యులు పవన్,నిరంజన్ పాల్గొన్నారు
Share this on your social network: