యువ మోర్చా ఆధ్వర్యంలో నిరుద్యోగుల ర్యాలీ

Published: Wednesday July 14, 2021
ఇబ్రహీంపట్నం, జూలై 13 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైయం మండల అధ్యక్షులు బోడ నవీన్ రెడ్డి, ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన నిరుద్యోగ గర్జన ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలిని సీఎం కేసిఆర్ ప్రకటించినట్టు రెండవ సారి అధికారం లోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రం లో ఉన్న నిరుద్యోగులకు తక్షణం నిరుద్యోగభృతిని చెల్లించాలి అని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల బీజేవైయం కార్యదర్శి  బోడ రాజు, గన్నారపు వంశీ, దళిత మోర్చా ఉపాధ్యక్షులు, చాట్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.