మానసిక వికలాంగుల అవగాహన కొరకు ఆశ్రమంలో హోళీ సంబరాలు

Published: Tuesday March 30, 2021
బాలాపూర్, మార్చి 29, ప్రజాపాలన ప్రతినిధి : మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో హోళీ పండుగ సందర్భంగా సంబరాలను అభాగ్యుల మధ్యన ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు గిరి ఆశ్రమసిబ్బంది ఘనంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులను చల్లుకుంటూ ఆహ్లాదంగా కేరింతలు కొడుతూ, నృత్యాలు చేస్తూ ఆ అభాగ్యులకు మనసు పులకరించినట్లు మామూలు మనుషుల జీవితాలు సాగి మచ్చిక కలిగేటట్లు వసంత గమనాన్ని గుర్తు చేస్తున్నట్లు మాతృదేవోభవ వ్యవస్థాపకులు (గట్టు గిరి) వారి పిల్లలు కలిసి హోలీ.... హోలీ.... రంగల హోలీ చమ్మకేళినీ అంటూ సంబరాలు చేశారు.