గ్రామపంచాయతీలను తనిఖీ చేసిన ఎంపీడీవో

Published: Friday November 04, 2022

బోనకల్ నవంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని గురువారం నారాయణపురం, చిన్నబీరవల్లి రాపల్లి, జానకీపురం గ్రామపంచాయతీలను మండల ఎంపీడీవో బోడిపూడి వేణుమాధవ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ అన్ని పంచాయతీ కార్యదర్శులను, ఫీల్డ్ అసిస్టెంట్లను అన్ని గ్రామ పంచాయతీలలో మొక్కలు నాటడం , నర్సరీని మార్చడం గ్రేడింగ్ చేయడం కోసం కొత్త పని స్థలాన్ని గుర్తించాలని కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు మందడపు తిరుమలరావు, చిలక వెంకటేశ్వర్లు, పేరు బత్తిని శాంతయ్య, సండా కళావతి, ఆయా గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.