ఆలిండియా ఎస్ సి,ఎస్ టి ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ గా దేవావత్ భరత్ సింగ్ నియా

Published: Friday February 11, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : ఆలిండియా ఎస్ సి,ఎస్ టి ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా దేవావత్ భరత్ సింగ్ ఎన్నికయ్యారు. ఆయన నియామక పత్రాలను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ వాఘ్మారే నుండి అందుకున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దేవావత్ భరత్ సింగ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగాలలో ఒకటిగా పేరొందిన భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు అర్ధరహితం అన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితం, బాబా సాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా నాటి రాజ్యాంగ ఫలాలే నేడు మనం అనుభవిస్తున్నామన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా రాజ్యాంగం వల్లనే సాధ్యమయ్యిందని మరువొద్దన్నారు. కేసీఆర్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు ఎస్ సి ఎస్ టి ఐక్య వేదిక నాయకులు పాల్గొన్నారు.