మునుగోడులో ప్రభాకర్ రెడ్డి గెలుపుతో కార్పొరేటర్ సుభాష్ నాయక్ ఆధ్వర్యంలో సంబరాలు

Published: Monday November 07, 2022
మేడిపల్లి, నవంబర్ 6 (ప్రజాపాలన ప్రతినిధి)

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనమైన మెజార్టీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 11,666వేల ఓట్లతో విజయం సాధించిన సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్  2వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ కేతావత్ సుభాష్ నాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండా ఎగురవేసి సంబారాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల బాల్ రాజ్, ప్రధాన కార్యదర్శి వరికల శ్రీనివాస్,సినియర్ నాయకులు బండారు మల్లేష్ శ్రీరామోజు శంకర్ చారి గోపినాథ్ నాయక్,శివ, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు..