ప్రజా సమస్యల పై సీపీఎం నిరంతరం పోరాటం
Published: Tuesday September 21, 2021
ఇబ్రహింపట్నం, సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిధి : అబ్దుల్లాపూర్ మెట్ మండలం బండ రావిరాల సర్వే నెంబర్ 293 భూమిసర్వే చేస్తున్న అధికారులు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే చేసి ప్రభుత్వ భూమిని కబ్జా దారి నుండి రక్షించాలని, కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసినందున అధికారులు స్పందించి సర్వే చేయడానికి ఒక కమిటీని నియమించి సోమవారం రోజు సర్వేయరు రెడ్యా నాయక్ ఆధ్వర్యంలో ఐదు మంది సర్వేయర్లు ఇబ్రహీంపట్నం, యాచారం, అబ్దుల్లాపూర్ మెట్ లలో కలసి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలు పారదర్శకంగా, చేసి భూ కబ్జాదారులు నుంచి ప్రభుత్వ భూమిని బయటకు తీసి గతంలో ఇందిరమ్మ ఇళ్ల కింద సర్టిఫికెట్ ఇచ్చిన వారికి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, సిపిఎం పార్టీ అబ్దుల్లాపూ ర్ మెట్ మండల కార్యదర్శి ఈ నరసింహ్మ డిమాండ్ చేశారు.
Share this on your social network: