ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 11ప్రజాపాలన ప్రతినిధి *తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప

Published: Monday December 12, 2022

ఎఐసిసి అధ్యక్షులు  మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి అనుమతితో టిపిసిసి నూతన కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన చిలుక మధుసూదన్ రెడ్డి ని నియమించడం జరిగింది..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మండలం అనాజ్ పూర్ గ్రామానికి చెందిన చిలుక మధుసూదన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం జిల్లా మరియు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నో సేవలు అందించడం జరిగింది.  గతంలో ఏబీవీపీ విద్యార్థి విభాగంలో పనిచేసి అనంతరం టిఎన్ఎస్ఎఫ్ లో జిల్లా మరియు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసే సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేసి జైలుకు వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ క్రమంలో అప్పటినుండి  ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ఎంతో సన్నిహితంగా ఉంటూ 2018లో రాహుల్ గాంధీ గారి సమక్షంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో చేపట్టిన ఏకార్యక్రమాన్ని అయిన విజయవంతం చేయడంలో ముందువరుసలో ఉన్నారు.. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో టీపీసీసీ రాష్ట్ర ప్రతినిధిగా ఇటీవల నియమించబడి,  నియోజకవర్గ రైతుల మరియు విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై మరింత ఉత్సాహంతో ముందువరుసలో ఉండి పోరాటం చేయడం జరిగింది.. ఇప్పుడు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చెందిన ప్రజలు విద్యార్థులు యువకులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తన రాజకీయ గురువు  ఎనుముల రేవంత్ రెడ్డి కి మరియు ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ మాజీ ఎమ్మెల్యే  మల్ రెడ్డి రంగారెడ్డి కి చిలుక మధుసూదన్ రెడ్డి   ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా మా అభిమాన నాయకుడు రేవంత్ అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా శక్తివంచన లేకుండా ఆత్మస్థైర్యంతో మీరు ఇచ్చిన సూచనలతో పనిచేస్తా నని కాంగ్రెస్ పార్టీ సైనికుడిలా అధికార పార్టీ చేస్తున్న నియంత పోగోడాలపై తప్పకుండా పోరాడుతానని ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుగా పనిచేస్తానని   తెలియజేస్తున్నాను.