జోగన్ పల్లి లో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం

Published: Friday January 20, 2023

కోరుట్ల, జనవరి 19 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం గురువారం రోజున ప్రారంభించారు. జనవరి 19 నుండి ఫిబ్రవరి  2 వ తేదీ వరకు  ఉదయం 9గంటల  నుండి సాయంత్రం 4 వరకు గ్రామంలోని రెడ్డి సంఘ భవనంలో కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య తెలిపారు.గ్రామ ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగిచుకోని కంటి సమస్యలను దూరం చేసుకోవాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ, జడ్పిటిసి దారిశెట్టి లావణ్య, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వెంకట్రావు, వైస్ ఎంపీపీ చీటీ స్వరూప, ఎంపీడీవో నీరజ, హెల్త్ సూపర్వైజర్ ఇఫ్తార్, కంటి వెలుగు బృందం వైద్య అధికారి రమ్య, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు దారిశెట్టి రాజేష్,మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు అంజయ్య , సర్పంచులు శారద లింగారెడ్డి , స్థానిక సర్పంచ్ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య, ఉపసర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బలవంత రెడ్డి, దూలూరి నర్సింలు, పంచాయతీ కార్యదర్శి హకీమ్, పడాల శేఖర్ ఎం.ఎల్.హెచ్.పి ప్రతిష్ట, ఎ.యన్.యం రాజేశ్వరి, ఆశ శ్వేత ,అంగన్వాడీలు, లక్ష్మీ ,వనజ, కృష్ణవేణి, సిఏలు సృజన స్వప్న కారోబర్ అంజయ్య, పంచాయతీ సిబ్బంది, మరియు గ్రామ ప్రజలందరూ  పాల్గొన్నారు.