ఈనెల 16 తర్వాత జి. కిషన్ రెడ్డి తెలంగాణలో ఆశీర్వాద యాత్ర

Published: Friday August 13, 2021
బాలాపూర్: ఆగస్టు12, ప్రజాపాలన ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వ పథకాలు, అన్ని వర్గాలలో ప్రచారం చేసి, భారతీయ జనతా పార్టీ గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఢిల్లీలో అన్నారని కోలన్ శంకర్ రెడ్డి పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి  కార్యాలయంలో బాలాపూర్ మండలం బాలాపూర్ గ్రామ నివాసులైన బిజెపి సీనియర్ నాయకుడు మాజీ సింగిల్విండో చైర్మన్, శ్రీ ప్రహస్తా ట్రస్ట్ కోశాధికారి కోలన్ శంకర్ రెడ్డి బిజెపి బృందంతో మర్యాదపూర్వకంగా కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆశీస్సులతో క్యాబినెట్ పర్యటక సంస్కృతి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జి కిషన్ రెడ్డి కి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపి, వేద పండితులతో ఆశేక్షచనమును చేయించారు. ఈ సందర్భంగా గంగాపురం కిషన్ రెడ్డి మాట్లాడుతూ..... కేంద్ర ప్రభుత్వ పథకాలు, అన్ని వర్గాలలో ప్రచారం చేసి, భారతీయ జనతా పార్టీని గెలుపే ధ్యేయంగా  ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.కోలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా క్యాబినెట్ మంత్రి జి. కిషన్ రెడ్డి. (16/8/2021) నుండి నాలుగు రోజుల వరకు క్యాబినెట్ మంత్రిగా ఆశీర్వాదయాత్ర చేపడుతున్న సందర్భంగా యాత్ర శుభప్రధం  కావాలని బీజేపీ నేతలు మనస్ఫూర్తిగా, మంత్రిని కలిసిన నాయకులు కోరుకుంటున్నామని అన్నారు.