మధిర సేవా సమితి సభ్యులను సన్మానించిన కాకతీయ కమ్మ సేవా సమితి

Published: Monday July 12, 2021

మధిర, జూలై 11, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిట గత 45 రోజుల నుంచి మధిరలో కోవిడ్ పేషెంట్లకు వేడివేడి భోజనం అందిస్తూ చక్కటి సేవలు అందించిన కాకతీయ కమ్మ సేవా సమితి ఈరోజు క్లబ్ కాంప్లెక్స్ లో ముగింపు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారికి సహకారం అందించిన దాతలు మరియు సేవలందించిన వాలంటీర్లకు మరియు కోవిడ్ సమయంలో మధిరలో విస్తృత సేవలు అందించిన మధిర సేవా సమితి సభ్యులకు ఘన సన్మానం నిర్వహించినా ఈ కార్యక్రమాన్నిపురస్కరించుకుని మధిర సేవా సమితి అధ్యక్షులు పల్లపోతుల ప్రసాదరావు మాట్లాడుతూ కాకతీయ కమ్మ సేవా సమితి చేసిన సేవలను కొనియాడుతూ అభినందనలు తెలియజేస్తూ ఇకముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేస్తారని ఆశిస్తూ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మధిర సేవా సమితి సభ్యులు పల్లపోతు ప్రసాద్ రావు, చారుగుండ్ల నరసింహమూర్తి, మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు, యర్రా లక్ష్మణ్, షేక్ జహంగీర్ కోమటీడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు