ఫైర్ మరియు కరంట్ సిబ్బందికి ఉచిత మాస్క్ ల పంపిణీ

Published: Wednesday April 07, 2021

మధిర, ఏప్రిల్ 06 ప్రజాపాలన ప్రతినిధి : ఫౌండేషన్ మరియు CSIR-IICT హైదరాబాద్ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ S. శ్రీధర్ వారి సౌజన్యంతో కరోనా వ్యాప్తి అరికట్టటంలో భాగంగా మధిరకు చెందిన అగ్నిమాపకసిబ్బందికి, కరెంటు ఆఫీస్ సిబ్బందికి మండల విద్యాశాఖాధికారి శ్రీ Y. ప్రభాకర్ గారి చేతుల మీదుగా మాస్క్ లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా Meo Y. ప్రభాకర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరు మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. మాస్క్ లను ఉచితంగా అందించిన సిప్లా ఫౌండేషన్ వారికి, డా. శ్రీధర్ గారికి ధన్యవాదములు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ మధిర ప్రాంత నిర్వాహకులు సంక్రాంతి శ్రీ నివాసరావు, మేడేపల్లి శ్రీ నివాసరావులతో పాటు ఫైర్ సిబ్బంది, కరెంటు ఆఫీస్ సిబ్బంది  పాల్గొన్నారు.