సీతారామంజనేయ కూరగాయల మార్కెట్ ప్రారంభో మధిరజూలై 15 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిల
Published: Saturday July 16, 2022
మెయిన్ రోడ్డు నందు క్లబ్ కాంప్లెక్స్ ఆవరణలో తాత్కాలికంగా మార్కెట్ ఏర్పాటు.మధిర పట్టణంలోని మెయిన్ రోడ్డు నందు ఉన్న క్లబ్ కాంప్లెక్స్ ఆవరణలో సీతారామంజనేయ కూరగాయల మార్కెట్ ను శుక్రవారం నాడు ప్రారంభించారు. ప్రస్తుత మార్కెట్ స్థలంలో సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తి అయ్యేవరకు ప్రజలకు దగ్గర లో ఉండేలా తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు , కౌన్సిలర్, సీపీఎం సీనియర్ నాయకులు కట్టా గాంధీ , ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు , సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్ , మధిర పట్టణ తెరాస పార్టీ అధ్యక్షులు పల్లపోతు వెంకటేశ్వరరావు , తెరాస మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి , తెరాస యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ కూన నరేందర్ రెడ్డి , మార్కెట్ నిర్వహణ కమిటీ సభ్యులు ,పలువురు పాల్గొన్నారు.
Share this on your social network: